వెన్నుపోటుకు రెండేళ్ళే…

0
9


నవతరం, కాకినాడ: చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు.. జూన్ 4 నుండి 12 వరకు వైయస్సార్ సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనలు!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అబద్ధపు హామీలతో ప్రజలను వంచించి. ఆంధ్రప్రదేశ్‌కు వెన్నుపోటు పొడిచి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా కేంద్ర కార్యాలయంలో జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు తోట నరసింహం, ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముద్రగడ గిరిబాబు టాస్క్ ఫోర్సు సభ్యులు ఓమ్మీ రఘురాం, తోట రాంజీ మరియు పలువురు వైసిపి నాయకులు వెన్నుపోటుకు రెండేళ్ల పేరుతో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోసపూరిత పాలనను, అమలుకాని మేనిఫెస్టోను నిరసిస్తూ జూన్ 4 నుండి జూన్ 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాబోతున్నామని నేతలు ఈ సందర్బంగా తెలియజేసారు.
నిరసనల షెడ్యూల్:
జూన్ 4 మండల కేంద్రాల ప్రధాన కూడళ్లలో టీడీపీ మేనిఫెస్టో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలు చేసిన బాండ్లు, పత్రికా ప్రకటనల కాపీల దహనం.
జూన్ 8, 9 నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో టౌన్ హాల్ సదస్సులు.
జూన్ 12 న నియోజకవర్గ కేంద్రాల్లో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసనగా భారీ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాలలో పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్ పాల్గొనాలని జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పిలుపునివ్వడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here