నాలుగు నెలలుగా టీచర్ ఆచూకీ కనిపించడం లేదు….

0
470

లోకేష్ నిర్వహిస్తున్న శాఖ ఇదేనా…..?..


మరొక టీచర్ ను నియమించకపోవడం వెనుక ఆంతర్యం…..!..

ఉపాధ్యాయుడు బాధ్యత చేపట్టిన వాలంటీర్…..!..

నవతరం, అనంతగిరి (పాడేరు అల్లూరి జిల్లా): అల్లూరి జిల్లా పరిధిలో కొన్ని ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి నిదర్శనం అనంతగిరి మండలం పెదకోట పంచాయితీ వేలమామిడి గ్రామంలో గల పాఠశాలకు గత కొద్ధి రోజులుగా ఉపాధ్యాయులు లేక ఒక వాలంటీర్ ఒక్కడే విద్యార్థులకు విద్య భోదన చేస్తున్నాడు. టీచర్ లేకపోవడం వలన పిల్లలు ఎంతలా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఆ వాలంటీర్ మాట్లాడుతూ ఈ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ కు గత కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ అవ్వగా సెలవు పెట్టారని శెలవుపై వెళ్లిపోవడం వలన గత నాలుగు నెలలుగా నేనే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నానని అయితే ఎక్కువ మంది విద్యార్థులు ఉండటం వలన విద్యార్థులకు పూర్తిస్థాయిలో చదువు చెప్పలేకపోతున్నానని, కొంతమంది అర్థం చేసుకుంటున్నారు మరికొంత మంది అర్థం చేసుకోలేకపోతున్నారని దీని వలన విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఇప్పటికైనా గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సంబంధిత విద్యాశాఖాధికారులు, జిల్లా కలెక్టర్, మంత్రి లోకేష్ పాఠశాలకు ఉపాధ్యాయులును నియమించాల్సిందిగా ఆయన కోరారు. ఇక్కడ గుర్తించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే పాఠశాలకు ఇద్దరు టీచర్లు ఉంటే ఒక టీచర్ సెలవు పెట్టినా మరొక టీచర్ వుంటారు కానీ ఈ పాఠశాలకు సంబంధించి ఒకరే టీచర్ వుంటారు. ప్రమాదవశాత్తు ప్రమాదం బారిన పడి విధులకు సెలవు పెట్టిన తరుణంలో అక్కడ మరొక టీచర్ ను నియమించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులకు ఉందా లేదా అనేది ఆశ్చర్యకరంగా మారింది. అనివార్య కారణాల వలన ఆ వాలంటరీ పాఠశాలకు రాకపోతే పిల్లలు పాఠశాలకు వెళ్లే పనే ఉండదు చదువుకు దూరం కాకపోతే ఇంకేం అవుతుంది ఇంకో విషయం ఏమిటంటే 52 మంది విద్యార్థులు స్థానికంగా ఉన్న వ్యక్తి (వాలంటీర్ ) మాట వింటారా..? అనే కోణంలో ఆలోచించిన విద్యార్థులు చదువుకు దూరం అవుతారు అనేది మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ విధులు నిర్వహిస్తున్న టీచర్ కు ప్రమాదం జరిగి ప్రమాదవశాత్తు నాలుగు నెలలు సెలవు పెట్టడం ఒకవైపు అయితే నేటి వరకు ఇంకో టీచర్ ను నియమించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అనే విషయం సరికొత్త కోణంగానే భావించాలి. విద్యాశాఖ చూస్తున్న లోకేష్ తన శాఖ తీరు ఎలా చూడకపోవడం ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఈ పాఠశాలకు నూతన టీచర్ ను నియమించి గిరిజన విద్యార్థులకు విద్య పూర్తి స్థాయిలో అందేలా చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే…?? టీచర్ నియమించకుండా ఉంటే వారు భవిష్యత్తు నాశనం అవ్వడానికి గల కారణం, ఎవరు బాధ్యత వహిస్తారు అనేది ప్రశ్నార్థకం..? గిరిజన ప్రాంతాలలో విద్యార్థినీ విద్యార్థుల విద్యకు అంత బాధ్యతరాహిత్యముగా విద్యాశాఖ వ్యవహరించడం ఆందోళన కలిగిస్తున్న అంశమని స్థానికులు వాపోవుచున్నారు.