
నవతరం, భీమిలి: ఈ రోజు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు భీమిలి నియోజకవర్గం ఆనందపురం పార్టీ ఆఫీస్ లో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సీపి జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త శ్రీమజ్జి శ్రీనివాస రావు (చిన్న శ్రీను), కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ ఆదివారం ఆనందపురం పార్టీ ఆఫీస్ లో కేకు కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కార్యకర్తలు, నాయకులు సమక్షంలో నాయకుడుపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ముందు వరుసలో ఉన్నారని, విద్యా, వైద్యానికి ప్రాధాన్యత కల్పిస్తూ రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉంచారని ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలన అస్తవ్యస్థంగా తయారైదన్నారు. అందువల్ల మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి పాలన కోసం ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్నారని త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాటం చెపుతారని ఆశాభావం వ్యక్తం చేసారు .ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ పరిధిలో పార్టీ SEC మెంబర్లు, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు, మండల మరియు డివిజన్ పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీ లు, కార్పొరేటర్లు, జిల్లా, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, మండల కమిటీల సభ్యులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, సోషల్ మీడియా కార్యకర్తలు, మహిళా ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు స్థానిక ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, వైసిపి కార్యకర్తలు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, వేలాది మంది ప్రజలు పాల్గొని తమ నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

