కూటమి పాలనలో కొత్త సంవత్సరంలోనైనా మార్పు వచ్చేనా…

0
68

కూటమి ప్రభుత్వ పాలన కష్టాల మయం రెండేళ్లలో తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎన్నికలకు ముందు ఓ మాట… గద్దెనెక్కిన తర్వాత మరో మాట ప్రజలపై భారాలు మోపేలా కూటమి సర్కార్ చర్యలు విద్య, వైద్య, వ్యవసాయ రంగాలపై చిన్న చూపు నూతన సంవత్సరంలోనైనా ప్రభుత్వ పాలనలో మార్పులు రావాలి. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల వక్షానే వైయస్సార్సీపి వైఎస్ఆర్సిపి జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి మరియా రామకృష్ణ నవతరం, పలాస: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం శూన్యమని, కొద్ది సమయంలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని, ప్రస్తుతం వ్యవస్థలన్నీ బ్రష్టు పట్టి కుదేలయ్యాయని వైఎస్ఆర్సిపి జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి మడియ రామకృష్ణ అన్నారు. బుధవారం పలాసలో ఆయన మాట్లాడుతూ.. 2025 సంవత్సరం కూటమి ప్రభుత్వ పాలన స్కాముల మయంగా మారిందన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పథకాలతో పాటు.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పథకాలు అంటూ ఎన్నికల ముందు ప్రజలను మభ్య పెట్టారని మడియా రామకృష్ణ చెప్పారు. నేడు ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అంశం లోను ఒక్కో స్కాం వెలుగు చూస్తుందన్నారు. ఎన్నికలకు ముందు అధికారమే ధ్యేయంగా హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలన ప్రజలకు కష్టాల మయంగా మారిందని రామకృష్ణ ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే రైతాంగానికి కష్టాలు తప్పవన్న అన్నానుడే మరోసారి నిజమవుతుందని ఆయన ఎద్దేవా చేశారు. రైతాంగానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, గిట్టుబాటు ధరలు దక్కకపోగా.. సాగు కోసం చేస్తామన్న అన్నదాత సుఖీభవ సాయం కొందరికి ఇచ్చి మరి కొందరికి అందకుండా పోయిందన్నారు. బస్తా యూరియా కోసం రైతులు రోజులు తరబడి నిరీక్షించడంతో పాటు పోలీసుల లాఠీ దెబ్బలు తినడం ప్రభుత్వ పాలనకు అద్దం పడుతుందని ద్వజమెత్తారు. పేద ప్రజలకు సైతం కార్పొరేట్ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలనే సంకల్పంతో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఆ పథకానికి పేర్లు మార్చుకోవడమే కాకుండా చివరికి సేవలు నిలిపివేసిన ఘనత కూటమి సర్కార్ దేనిని మరియా రామకృష్ణ ఆరోపించారు. వైద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆయన దుమ్మెత్తి పోశారు.

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు వైద్యం, వైద్య విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మిస్తే వాటిని ప్రైవేటీకరణ దుర్మార్గపు చర్యగా పేర్కొన్నారు. ప్రస్తుతం సూపర్ సిక్స్ లేదు.. రెండేళ్లలో ఒక కొత్త పింఛన్ మంజూరు చేయలేదని ఆయన చెప్పారు. 2019 సంవత్సరంలో వైయస్సార్సీపి అధికారంలోకి వచ్చిన సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 39 లక్షల పింఛన్లు ఉంటే 2024 ఎన్నికల సమయానికి 66.34 లక్షల మందికి ఆ సంఖ్య పెరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పింఛన్లు ఇవ్వకపోగా, సుమారు 5 లక్షల పైగా పింఛన్లు నిలిపివేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో పేదల బతుకులు చితికి పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త యాడాదిలోనైనా కూటమి ప్రభుత్వం ప్రజా రంజక పరిపాలన సాగించాలని ఆయన సూచించారు. అదేవిధంగా విద్య, వైద్య, వ్యవసాయ రంగాలపై చిన్న చూపు తగదని, నూతన సంవత్సరంలోనైనా ప్రభుత్వ పాలనలో మార్పు రావాలని ఆయన కోరారు 2026 కొత్త యాడాదిలో ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలని రామకృష్ణ ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, పాలకుల ఆలోచన తీరులో మార్పు వచ్చి హామీలను అమలు చేస్తారని ఆశ బాబు ఆయన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న లేకున్నా ప్రజలు పక్షాన వైఎస్ఆర్సిపి నిరంతరం ప్రజా పోరాట ఉద్యమాలు చేపడుతుందని ఆయన స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here